లండన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్..ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

by Disha Web Desk 21 |
లండన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్..ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకొని మంగళవారం గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మంత్రులు విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.


Next Story

Most Viewed