రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.10 వేలు

by Dishafeatures2 |
ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: వరద ముంపునకు గురైన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లందరికీ పది రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. ముమ్మిడివరం మండలంలోని వరద బాధితులను ఆయన పరామర్శించారు. వరద ముంపుకు గురైన ప్రతి గుడిసెకు రూ.10 వేల పరిహారం ఇస్తామని అన్నారు. పది రోజుల్లో రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. వరద ఉధృతి కట్టడికి 3.5 కిలోమీటర్ల రక్షణ గోడను నిర్మిస్తామని చెప్పారు.అందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed