చిన్న రాయికే CM జగన్‌ మైండ్ దొబ్బింది.. సోషల్ మీడియాలో స్వాతిరెడ్డి సెటైర్

by Disha Web Desk 9 |
చిన్న రాయికే CM జగన్‌ మైండ్ దొబ్బింది.. సోషల్ మీడియాలో స్వాతిరెడ్డి సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం కూడా జగన్ బస్సు సిద్ధం యాత్రలో హాజరై మాట్లాడుతూ.. ‘‘దత్తపుత్ర దత్తపుత్ర.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లల్ని పుట్టించి పెళ్లి, నాలుగేళ్లకొకసారి, ఐదేళ్లకొకసారి కార్లు మార్చేసినట్లుగా భార్యల్ని వదిలేసి.. ఇప్పుడు నియోజకవర్గాన్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావ్ నువ్వు ఏం మనిషివయ్యా. దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్యకాలంలో బీపీ కనిపిస్తుంది. అయ్యా దత్తపుత్రా ఒకసారి చేస్తే పొరపాటు అవుతుంది. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారయ్యా దత్తరపుత్త. పవిత్రమైన సంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావడం.. ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం.. ఘోరమైన తప్పు కాదా? అని అడుగుతున్నాను. ఇది నేను అడిగితే తప్పు అని అంటున్నారు. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే, ఇలా నాలుగైదేళ్లకొకసారి భార్యల్ని మార్చడం మొదలుపెడితే అక్కచెల్లెల్ల బతుకులేం కావాలి. అది కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని ఏం అనాలంటూ’’ జగన్ చెప్పుకొచ్చారు. జగన్ ప్రసంగంపై తాజాగా టీడీపీ సోషల్ మీడియా నేత స్వాతి రెడ్డి సెటైర్ వేసింది. ‘‘వీడికి చిన్న రాయికే మైండు దొబ్బేసింది’’ అని ట్విట్టర్ వేదికన జగన్ ప్రసంగానికి క్యాప్షన్ రాసుకొచ్చింది.

Next Story

Most Viewed