Ap News: ఈసారి ఉగాది వేడుకలు అక్కడే..!

by Disha Web Desk 16 |
Ap News: ఈసారి ఉగాది వేడుకలు అక్కడే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఉగాది వేడుకలు విశాఖలో నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచే పరిపాలన సాగబోతోందంటూ ఇప్పటికే వైసీపీ మంత్ల్రులు ప్రకటనలు చేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్‌లో ఇక్కడి నుంచి పారిపాలన చేయబోతున్నట్లు సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు తాడేపల్లి నుంచి ఉగాది రోజునే విశాఖకు షిఫ్ట్ అవుతారని, అక్కడే ఉగాది వేడుకలు జరుపుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం లేదా బీచ్ కారిడార్‌లో ఉగాది వేడుకలు జరుపుకుంటారని చెబుతున్నారు. ఇక ఉగాది వేడుకల్లో అందజేసే పురస్కారాలను రెండు, మూడు రోజుల్లో అధికారులతో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీ రాజధాని అంశంపై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అలాగే ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉగాది వేడులకపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed