నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం.. పవన్ పై సీఎం జగన్ సెటైర్లు

by Dishafeatures2 |
నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం.. పవన్ పై సీఎం జగన్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అంటూ సీఎం వైఎస్ జగన్ మరోసారి విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అమ్మఒడి కార్యక్రమం అమలులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి గతంలో మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత టీడీపీ ఎన్నో హామీలను అమలు చేయలేకపోయినా ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. చంద్రబాబు ప్రజలకు రాసిన లేఖలో పూచికత్తు సంతకం చేసిన పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద వారి దగ్గర నుంచి చిన్న పిల్లాడి వరకు మోసం చేస్తున్నా ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగాడని నిలదీశారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఎప్పటికీ దత్తపుత్రుడేనని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని లారీగా పేర్కొన్నారు.‘ పవన్ కల్యాణ్ వస్తాడు. లారీ ఎక్కుతాడు. ఆ లారీ పేరు వారాహి అంట. వారాహి వాహనంపై ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చని వారిని బూతులు తిడతాడు ఈ ప్యాకేజీ స్టార్. తోలు తీస్తా. చెప్పుతో కొడతా. తన్నుతా అంటూ బూతులు తిడతాడు’ అని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ నోటికి అదుపు ఉండదూ... మనిషికి నిలకడా ఉండదు అని విమర్శించారు. రౌడీల మాదిరిగా మీసాలు మెలేయలేం. రౌడీల మాదిరిగా తొడలు కొట్టలేం. పవన్ కల్యాణ్ మాదిరిగా బూతులు కూడా తిట్టలేం. అంతేకాదు నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యను కూడా మార్చలేం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పెళ్లి అనే పవిత్రమైన ఒక వ్యవస్థను పవన్ కల్యాణ్ మాదిరిగా నడిరోడ్డుపైకి తీసుకురాలేం అని అన్నారు. ఇవన్నీ పవన్ కల్యాణ్ పేటెంట్ మాత్రమేనని సీఎం వైఎస్ జగన్ ఘాటుగా విమర్శించారు.



Next Story

Most Viewed