రాష్ట్రంలో అదే రౌడీయిజం: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

డ్రగ్స్, రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ...

రాష్ట్రంలో అదే రౌడీయిజం: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్ డెస్క్: డ్రగ్స్, రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) హెచ్చరించారు. తిరుపతి(Tirupati)లో డీపీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతి(Tirupati)ని నేర రహిత సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తప్ప చేసిన వారెవరికీ మినహాయింపు ఉందన్నారు. రాజకీయ ముసుగులో చేసే నేరాలను ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ(Tdp) వాళ్లైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలని చెప్పారు. వైకుంఠ ఏకాదశి అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలు అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని చూస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story