వేగం.. నాణ్యత రెండూ ఉండాల్సిందే: అధికారులకు చంద్రబాబు ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-31 10:36:19  IST  )

రాజధాని పనుల్లో వేగం, నాణ్యత ఉండాల్సిందేనని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు..

వేగం.. నాణ్యత రెండూ ఉండాల్సిందే: అధికారులకు చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనుల(Amaravati Works)ను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులు ఇప్పటివరకూ ఎంత వరకు వచ్చారు...?, కాంట్రాక్టర్లు ఎలా చేస్తున్నారు. పనుల్లో నాణ్యత ఉందా లేదా అనే అంశాలపై సీఎ చంద్రబాబు(Cm Cahandrababu) మరింత ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, ఆయా సంస్థల యజమాన్యాలతోపాటు అధికారులను చంద్రబాబు మాట్లాడారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించాల్సిందేనని, వేగం కూడా మరింత పుంజుకోవాలని సూచించారు. అలాగే నిర్దేశించిన సమయానికల్లా రాజధాని పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story