- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Mp Gurumurthy: తిరుపతి జిల్లా నుంచి వెళ్లిన వారంతా క్షేమం
దిశ, తిరుపతి: హౌరా ఎక్స్ప్రెస్లో తిరుపతి జిల్లా నుంచి వెళ్లిన వాళ్లంతా క్షేమంగా ఉన్నారని తిరుపతి లోక్సభ సభ్యుడు గురుమూర్తి వెల్లడించారు. ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తిరుపతికి రైల్వే స్టేషన్కి వెళ్లారు. అధికారుల నుంచి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకున్నారు. మృతులు, గాయపడ్డ వారు ఉన్నారా అని ఆరా తీశారు. రైల్వే రిజర్వేషన్ వివరాలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నుంచి 18 మంది, రేణిగుంట నుంచి 8 మంది, గూడూరు నుంచి ఇద్దరు ప్రయాణికులు హౌరా ఎక్స్ప్రెస్లో ప్రయాణించారని తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారని, అవసరమైన సహాయ సహకారాలు తిరుపతి రైల్వే అధికారులు అందిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Odisha Rail Incident: ఏపీ వాసులు మృతి చెందినట్లు సమాచారం లేదు: బొత్స