Tirumala: జూన్ 28న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌, వేలం

by Disha Web Desk 16 |
Tirumala: జూన్ 28న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌, వేలం
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యం జూన్ 28వ తేదీన టెండర్‌‌తో పాటు వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,080 కేజీలు టెండర్‌, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు జూన్ 28వ తేదీలోపు కార్యనిర్వహణాధికారి, టీటీడీ పేరిట రూ. 25,000/- ఈఎండీ, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.



Next Story

Most Viewed