Kidnap: అందరూ చూస్తుండగా మహిళ కిడ్నాప్

by Disha Web Desk 16 |
Kidnap: అందరూ చూస్తుండగా మహిళ కిడ్నాప్
X

దిశ, రేణిగుంట: రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ ఏఎన్ఆర్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేగింది. స్థానిక నివాసి రవిచంద్ర సతీమణి పార్వతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పార్వతి భర్త రవిచంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే రవిచంద్ర ఇంటిపై శ్రీకాళహస్తి వీఎమ్‌పల్లికి చెందిన కూలి మస్తాన్, కూలిరాజమ్మ, కూలి ధనలక్ష్మి, కూలి సాయి కుమార్ మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, ఫర్నిచర్లను ధ్వంసం చేశారు. అంతేకాదు ఇంట్లో ఉన్న రవిచంద్ర సతీమణి పార్వతిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. కాలనీ ప్రజలందరూ చూస్తుండగానే దౌర్జన్యంగా మహిళను కిడ్నాప్ చేశారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాధిత రవిచంద్ర గాజుల మండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో మహిళ కిడ్నాప్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Next Story

Most Viewed