Breaking: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు

by Disha Web Desk 16 |
Breaking: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం సభలో పోలీసులను ఆయన అసభ్యపద జాలంతో దూషించారని ఎస్‌ఐ రవి కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడిపై కుప్పం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీటీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.

Next Story