Tirumala: అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

by Disha Web Desk 16 |
Tirumala: అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, తిరుపతి: వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి దర్శనం 10 గంటలు పడుతుంది. కాగా ఏప్రిల్‌ 6న స్వామివారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

తిరుపతిలో వందేభారత్ రైలు రిజర్వేషన్ ప్రారంభం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Next Story

Most Viewed