Chittoor: యువతి అరాచకం.. మిస్టరీ చేధించిన పోలీసులు

by Disha Web Desk 16 |
Chittoor: యువతి అరాచకం.. మిస్టరీ చేధించిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రగిరి మండలం శానంభట్ల గ్రామంలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాల మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ ప్రమాదాలకు కారణం యువతి పిల్లపాలెం కీర్తిగా గుర్తించారు. కీర్తి ఇంటర్ ఫైయిల్ కావడంతో ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నారు. అయితే తల్లి ప్రవర్తన తనకు నచ్చలేదు. తన అమ్మ మారాంటే ఊరి నుండి వెళ్లిపోవాలని కీర్తి భావించారు. దీంతో సొంత ఇంటిలోనే అగ్ని ప్రమాదానికి పాల్పడింది. అనంతరం తన తల్లి ప్రవర్తనకు కారకులైన వారి ఇంటిలోనూ నిప్పు పెట్టి భయ బ్రాంతులకు గురి చేసి నష్టం చేయాలని అనుకుంది. ప్లాన్ పక్కగా అమలు చేసింది. పట్టుబడకపోవడంతో వారి కుటుంబానికి, తనతో వ్యక్తిగతంగా మనస్పర్దలు ఉన్న వారి ఇళ్లల్లో కూడా అగ్నిప్రమాదాలను కొనసాగించడం జరిగింది.

అలా సుమారు 12 అగ్ని ప్రమాదాలకు కీర్తి కారకురాలైంది. అన్నీ కూడా తానే చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో కీర్తిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే తమ ఇంటి బీరువాలో కాలిపోయాయని చెప్పి, తన దగ్గర ఉంచుకున్న రూ. 30 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed