Tirupati: వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

by Disha Web Desk 16 |
Tirupati: వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. వెదురుకుప్పం మండలం కమ్మకండిగా గ్రామంలో జరిగే దహన క్రియల కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed