- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics:రాష్ట్రం గంజాయి మయం..వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం!
దిశ,ఏలూరు: రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వ దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు 12 పంపులు సెంటర్లో జరిగిన ప్రజాగళం సభలో శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి మయంగా చేశారని ఆరోపించారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మీరు వేసే ఓటు ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపడానికి నాంది పలుకుతుందన్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడు అన్నారు.
ప్రజల కోసం పోరాడుతుంటే నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. మీ జీవితాలు ఈ సైకో వల్ల 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. నేను వచ్చిన తర్వాత 100 రోజుల్లో గంజాయి బ్యాచ్పై ఉక్కుపాదం మోపుతా. ఈ పేద బిడ్డలను కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు పంచుతా. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇచ్చే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు . రాష్ట్రంలో నిత్యావసరాలు, కరెంట్, పెట్రోల్, పన్నులను పెంచి మీ కొంపలను ఈ సైకో ముఖ్యమంత్రి గుల్ల చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉంటే.. ఇప్పుడు రూ.200 చేశారని చంద్రబాబు అన్నారు. సభలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.