Chandrababu: ప్రధాని మోదీకి, కేంద్రప్రభుత్వానికి శుభాకాంక్షలు

by Disha Web Desk 16 |
Chandrababu: ప్రధాని మోదీకి, కేంద్రప్రభుత్వానికి శుభాకాంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి నూతన పార్లమెంట్ భవన ప్రారంభంపై శుభాకాంక్షలు తెలిపారు. పేదరిక నిర్మూలనకు అవసరం అయ్యే పాలసీల రూపకల్పనకు ఈ పార్లమెంట్ వేదిక కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భారత దేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే నాటికి ఆర్థిక అసమానతలు లేని సమాజంగా తీర్చిదిద్దేలా పార్లమెంట్‌లో నిర్ణయాలు జరగాలని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: Anakapalli: తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్: అయ్యన్నపాత్రుడు


Next Story

Most Viewed