AP DSC: ఆల్​ది బెస్ట్​ చెప్పిన చంద్రబాబు.. ఎవరికంటే..

by Thanuru Gopichand |

డీఎస్సీ రాస్తున్న​అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆల్​ది బెస్ట్​చెప్పారు.

AP DSC: ఆల్​ది బెస్ట్​ చెప్పిన చంద్రబాబు.. ఎవరికంటే..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : డీఎస్సీ రాస్తున్న​అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) ఆల్​ది బెస్ట్​చెప్పారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్టు చేశారు. అదే విధంగా మంత్రి లోకేశ్​తన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో 17 కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు మొత్తం పూర్తయిన తర్వాత మరుసటిరోజు ప్రాథమిక కీ విడుదల అవుతుంది. అభ్యంత రాల స్వీకరణకు వారం గడువు ఉంటుంది.

Next Story