CM Chandrababu Naidu : జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష

by Muthe.Rajitha |   (  Updated:2025-05-20 16:40:55  IST  )

ఏపీ(AP)లో జిల్లాల పునర్విభజన(Redivisions of Districts)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Chandrababu Naidu : జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో జిల్లాల పునర్విభజన(Redivisions of Districts)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సమయం(Election Assurances)లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన మిగతా హామీలపై నివేదిక ఇవ్వాలని తెలిపారు. జిల్లాల పునర్విభజన నివేదికలో కూటమి పార్టీ నేతలతో పాటు.. వివిధ సంఘాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే పోలవరం(Polavaram) ముంపు మండలాలు, మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు వంటి అంశాలపై చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులకు తెలియజేశారు.

Next Story