కేంద్రమంత్రి ప్రభుత్వానికి జవాబుదారీ.. ఇండిగో సంక్షోభం వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి ప్రభుత్వానికి జవాబుదారీ.. ఇండిగో సంక్షోభం వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి ప్రభుత్వానికి జవాబుదారీ.. ఇండిగో సంక్షోభం వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో విమాన సర్వీసులు(Indigo Airline) కొన్నిరోజులుగా రద్దు అవుతూ.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంక్షోభంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఇండిగో సంక్షోభాన్ని మేం పర్యవేక్షించడంలేదని చెప్పారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రమే చూసుకుంటుందని అన్నారు. సాధ్యమైనంత వరకు కేంద్రం సమస్య పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. కేంద్రమంత్రి భారతప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో టాటా ఆధ్వర్యంలోని ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. B737, A320 విమానాల్లో పైలట్ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Next Story