కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-19 10:19:21  IST  )

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.

కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమంలో భాగంగా తాను కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ దత్తత ప్రక్రియకు సూచనగా ఆయా 250 కుటుంబాలకు "అడాప్ట్ ట్రీ"ని అందించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఈ కుటుంబాలను "బంగారు కుటుంబాలు"గా పిలుస్తూ, వారి సమగ్ర అభివృద్ధికి బాధ్యత తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దత్తత కార్యక్రమం ఆగస్టు 15 నుండి మొదలవగా.. సమాజంలోని ధనవంతులు, వ్యాపారవేత్తలు ఇందులో భాగం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Next Story