యువకుడిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ పంపారు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

by Disha Web Desk 19 |
యువకుడిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ పంపారు: వైసీపీపై చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆదివారం రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి హాజరై చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ నేతలది అహంకారంతో కూడిన పాలన అని మండిపడ్డారు. దళిత యువకుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారని ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ పనికిరాని చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ధరల బాదుడుతో పేదలపై భారం మోపుతూ.. సీఎం జగన్ పేదల రక్తం తాగుతున్నారని విమర్శలు కురిపించారు. సీఎం జగన్ దుష్టపాలన నుండి ఏపీని కాపాడుకుంటామని.. ఎవరైనా మమ్మల్ని అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.

వైసీపీ రాజకీయ రౌడీలకు శిక్ష వేసే బాధ్యత నాది అని టీడీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేస్తోన్న జగన్.. టీడీపీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీని దెబ్బతీయాలనుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్, వైసీపీ నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేసి పేద ప్రజలకు పంచుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed