బస్సు ప్రమాదం.. రేపు కర్నూలుకు కేంద్ర బృందం

by Muthe.Rajitha |

కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలిపోయిన ఘటనలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

బస్సు ప్రమాదం.. రేపు కర్నూలుకు కేంద్ర బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలిపోయిన ఘటనలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. కాగా కర్నూలులోని ఘటనా స్థలానికి కేంద్ర రవాణా అధికారుల బృందం సోమవారం రానుంది. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వేమూరి కావేరీ బస్సును పరిశీలించి, ప్రమాదంపై అధికారుల బృందం దర్యాప్తు చేయనున్నారు. అయితే ఈ ప్రమాదంపై విచారణ జరిపిన ఏపీ పోలీసుల బృందం.. బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందడానికి కిటికీలకు ఉన్న ఇనుప కడ్డీలే కారణమని తేల్చారు.

Next Story