తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Ajay Maddhiboyina |

నేడు ఆదివారం కావ‌డంతో ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో నారా రోహిత్ స‌తీస‌మేతంగా తిరుమ‌ల స్వామి వారి ద‌ర్శ‌నానికి విచ్చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు ఆదివారం కావ‌డంతో ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరో నారా రోహిత్ స‌తీస‌మేతంగా తిరుమ‌ల స్వామి వారి ద‌ర్శ‌నానికి విచ్చేశారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహ‌రి సైతం తిరుమ‌ల స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితో పాటు మాజీ హైకోర్టు న్యాయ‌మూరి జ‌స్టిస్ ఏ.వి ర‌వీంద్ర‌బాబు, త‌మిళ‌నాడు మంత్రి రామ‌చంద్ర కూడా వెంటేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు. ఇక కార్తీకమాసం కావడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు సినిమా రాజకీయ ప్రముఖులు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

Next Story