విశాఖలో CII సమ్మిట్.. తొలి రోజు రికార్డ్ స్థాయిలో Mouలు

by Vemula.Srinu Prasad |

విశాఖలో సీసీఐ భాగస్వాయ్య సదస్సు కొనసాగుతోంది...

విశాఖలో CII సమ్మిట్.. తొలి రోజు రికార్డ్ స్థాయిలో Mouలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో సీసీఐ భాగస్వాయ్య సదస్సు(Visakha CCI Partners Conference) కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు తొలి రోజు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 400 ఎంవోయూల ద్వారా రాష్ట్రానికి రూ. 11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 13 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించే చాన్స్ ఉందని స్పష్టం చేసింది. శనివారం సైతం సమ్మిట్ కొనసాగనుంది. ఈ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నారు. పలు సెక్టార్లపై సెషన్స్‌తోపాటు మరికొన్ని ఎంవోయూలు చేసుకోనున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు కోరనున్నారు.

Next Story