కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |

ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యారు...

కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయం(Ap Secretariat)లో కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committy) భేటీ అయ్యారు. సీఆర్డీఏ పరిధి(Crda)లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చిస్తున్నారు. కాగా రాజధాని అమరావతి(Capital Amaravati) సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు చెందిన భూ కేటాయింపుంపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనపై కేబినెట్ సబ్ కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రస్తుతం అమరావతి(Amaravati)లో భేటీ అయింది. గతంలో జరిగిన కేటాయింపులపై చర్చిస్తోంది. భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను సైతం కేబినెట్ సబ్ కమిటీ సూచించనుంది. ప్రపంచ స్థాయి సంస్థలను సైతం గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేయనుంది. ఈ మేరకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్ భేటీలో పాల్గొని చర్చిస్తున్నారు. భేటీ అనంతరం చర్చించిన అంశాలపై వివరించనున్నారు.

Next Story