బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసింది: మాజీ సీఎం జగన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 04:24:07  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మృత్యువాత పడడం పై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసింది: మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మృత్యువాత పడడం పై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం బస్సు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ అన్నారు. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్‌ రోడ్‌లో యాత్రికుల ప్రైవేట్‌ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


Read More..

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

Next Story