మండుతున్న ఎండలు.. ఆ 116 మండలాలకు హెచ్చరిక

by Disha Web Desk 9 |
మండుతున్న ఎండలు.. ఆ 116 మండలాలకు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎండలు మండుతున్నాయి. మండుతున్న ఎండలతో ఉ‌ష్ణోగ్రలు సాధారణం కంటే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంట నుంచి సాయంత్ర 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో 116 మండలాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమ, మంగళవారాలు పలు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తు నిర్వాహణ సంస్థ హెచ్చరించింది.

Next Story