- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తీవ్ర కలకలం.. వ్యక్తి దారుణ హత్య
రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది.

X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. తాగునీటి కుళాయి వద్ద జరిగిన గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంతకల్లుకు చెందిన కురుబ చంద్ర అనే వ్యక్తిపై అదే వీధికి చెందిన శివ అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడు.
అనంతరం శివ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో కొట్టుకున్న చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాగునీటి విషయంలో చెలరేగిన వివాదం కారంణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






