BREAKING: చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థి మార్పు.. అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ బీ ఫాం ఆమెకే

by Disha Web Desk 1 |
BREAKING: చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థి మార్పు.. అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ బీ ఫాం ఆమెకే
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకుడు.. సాయంత్రం మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నాడు. ఎన్నికలోచ్చాయంటే చాలు టికెట్ కోసం రాత్రికి రాత్రే అనుచరులతో తట్టా, బుట్టా చేతబట్టుకుని నిమిషాల్లో ప్లేటు ఫిరాయించే నాయకులు పుట్టుకొస్తున్నారు. ఒక వేళ ఐదైనా ఒక పార్టీ టికెట్ కేటాయించినా.. చివరి నిమిషంలో వరకు బీఫాం వస్తుందో.. రాదో అనే టెన్షన్ అటు నాయకులను వేధిస్తోంది. తాజాగా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలోనూ అచ్చం అలానే జరిగింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన గురువారం చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తూ వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బిశెట్టి సత్యవతికి బీఫాం అందజేసింది. అయితే, వైసీపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మొదట ఆ సీటును బూడి ముత్యాల నాయుడు‌కు కేటాయించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలీదు.. ఉన్నట్టుండి సీఎం జగన్ ఆ టికెట్‌ను బిశెట్టి సత్యవతికి కేటాయించడంతో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

AP Politics:నిన్న అక్కడ..నేడు ఇక్కడ..రెండు పార్టీల్లో మారిన కండువాలు!





Next Story

Most Viewed