BREAKING: ఎన్నికల వేళ చంద్రబాబుకు ఝలక్.. ఏకంగా 400 మంది మూకుమ్మడిగా రాజీనామా

by Disha Web Desk 1 |
BREAKING: ఎన్నికల వేళ చంద్రబాబుకు ఝలక్.. ఏకంగా 400 మంది మూకుమ్మడిగా రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో నేతల చేరికలు అధినేతలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో చంద్రబాబు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు టీడీపీకి ఏకంగా 400 మంది నాయకులు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు. అయితే, ఉండి నియోజకవర్గ టికెట్‌ను ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు కేటాయించడంతో స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామరాజును కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఒకే వేళ ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజునే ప్రకటిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రామరాజు వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు.

Next Story

Most Viewed