BREAKING: వాడో చిల్లర మనిషి.. ఇప్పుడు జోతిష్యం కూడా మొదలెట్టాడు: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: వాడో చిల్లర మనిషి.. ఇప్పుడు జోతిష్యం కూడా మొదలెట్టాడు: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట చేయబోతోందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పీకే వ్యాఖ్యలతో సంతోషంతో టీడీపీ, జనసేన నేతలు ఎగిరి గంతేస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడో చిల్లర మనిషంటూ ధ్వజమెత్తారు.

తమ లెక్కలో పీకే ఉద్యోగం నుంచి తీసిపడేసిన తహసీల్దార్‌తో సమానమని అన్నారు. రాజకీయ వ్యూహకర్తగా ఉంటూ గతంలో ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో ఓ రాజకీయ పార్టీ పెట్టాడని, చివరికి పార్టీ నడపలేక డిజాస్టర్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎక్కడా పని లేక ఇప్పుడు కొత్తగా డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టాడంటూ ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై పీకే చెప్పిన జోస్యం ఏమైందంటూ కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి కానీ, సీట్లివ్వరని, పవన్ కల్యాణ్ ఓడించేది టీడీపీయేనని అన్నారు.

Read More..

ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు మరో పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు



Next Story

Most Viewed