BREAKING: ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్.. మావోయిస్టుల కీలక స్పాట్ వెలుగులోకి..

by Disha Web Desk 1 |
BREAKING: ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్.. మావోయిస్టుల కీలక స్పాట్ వెలుగులోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవోబీ డి.కాయ్‌ 65 బెటాలియన్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించామని బెటాలియన్ కమాండ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సందీప్ కెర్‌కెట్టా తెలిపారు. మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మాపురం గ్రామాలకు మూడు, 4 కి.మీటర్ల దూరంలో ఉంది. కూంబింగ్‌లో భాగంగా భద్రతా దళాలు హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్లను సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story