BREAKING : అమరావతిని రాక్షసులు చరబట్టారు.. పండుగ రోజు చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING : అమరావతిని రాక్షసులు చరబట్టారు.. పండుగ రోజు చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : అమరావతిని రాక్షసులు చరబట్టారని, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజధాని పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటు పడిందని పేర్కొన్నారు.

రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతలను ముప్పుతిప్పలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఈరోజు నుంచే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని ధ్వజమెత్తారు. ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ దళితులు, బీసీలపై దాడులకు తెగబడుతోందని అన్నారు. 32 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.



Next Story

Most Viewed