బ్రేకింగ్ : చెట్టును బలంగా ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : చెట్టును బలంగా ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ - కర్ణాటక బార్డర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లె దగ్గర కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముల్బాగల్ నుంచి పుంగనూరు వస్తుండగా కారు కత్తార్లపల్లె వద్ద చెట్టును ఢీకొట్టింది. ముగ్గురు స్పాట్ డెడ్ కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. డెడ్ బాడీలను పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed