తిరుపతిలో హోటల్‌కు బాంబు బెదిరింపు.... తనిఖీలు

by Vemula.Srinu Prasad |

తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది....

తిరుపతిలో హోటల్‌కు బాంబు బెదిరింపు.... తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రాజ్‌పార్క్‌లో హోటల్‌లో బాంబు పెట్టామని కాసేపట్లో పేలిపోతోందని మెయిల్ పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో హోటల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. హోటల్‌లోని గదులను, బాత్ రూములను పరిశీలిస్తున్నారు. అంగుళం, అంగుళం క్షణ్ణంగా తనిఖీల చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు మెయిల్స్ వస్తున్నాయి. బాంబు పెట్టామని, పేలిపోతుందని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటన సమయంలోనూ ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పెట్టామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ సమయంలోనూ ఉత్కంఠ వాతావరణ కొనసాగింది. ఎలాంటి బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా కూడా బెదిరింపు మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది.

Next Story