కన్నా వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉంది: ఎంపీ జీవీఎల్

by Disha Web Desk 16 |
కన్నా వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉంది: ఎంపీ జీవీఎల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలితోనే పార్టీ వీడుతున్నట్లు కన్నా ప్రకటించారు. అంతేకాదు ఎంపీ జీవీఎల్ నరసింహారావుపైనా విమర్శలు చేశారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ విమర్శలకు జీవీఎల్ నరసింహరావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తామంతా పార్టీ విధి విధానాల ప్రకారమే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సోము వీర్రాజు పని చేస్తున్నారని తెలిపారు. సోము వీర్రాజుపై కన్నా విమర్శలు సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తన పరిధిలో మాత్రమే వ్యవహరించానని జీవీఎల్ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు.


Next Story

Most Viewed