Ap News: ఏపీలో మత మార్పిడిలు.. సోము వీర్రాజు ఆగ్రహం

by Disha Web Desk 16 |
Ap News: ఏపీలో మత మార్పిడిలు.. సోము వీర్రాజు ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిందూ దేవాలయాల భూములు, కానుకలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం, నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాదా మత మార్పిడికి జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం అనడానికి నిదర్శనం అని సోము వీర్రాజు మండిపడ్డారు.


Next Story

Most Viewed