ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురికి నోటీసులు

by Jakkula Mamatha |
ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురికి నోటీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ స్కాం(AP Liquor Scam) కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో నలుగురికి సిట్ నోటీసులిచ్చింది. వైసీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం జగన్‌కు(Former CM YS Jagan) OSDగా పనిచేసిన కృష్ణమోహన్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, ధనుంజయ్, రోహిత్ రెడ్డికి అధికారులు నోటీసులు అందజేశారు. ఎల్లుండి(ఆదివారం) ఉదయం 10 గంటలకు విజయవాడ(Vijayawada)లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కాం ఆరోపణల కేసుకు సంబంధించి సిట్ అధికారులు వివరాలు అందజేయాలని ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed