Telugu Desam Party : టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

by Disha Web Desk 18 |
Telugu Desam Party : టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గురువారం పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో సీఎం జగన్ పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కమలాపురం లో టీడీపీకి షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ వీర శివారెడ్డి తెలుగుదేశం నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.

Read More..

తిరుపతిలో వెంకటేశ్వరస్వామి కళ్ళు మూసుకొని ఉంటారు.. ఎందుకో తెలుసా?



Next Story

Most Viewed