- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏయూ కీలక నిర్ణయం

X
దిశ, వెబ్డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు విశాఖపట్నంలని ఆంధ్రా విశ్వవిద్యాలయ పరిధిలోని వసతి గృహాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. వర్సిటీ పరిధిలో ఇప్పటికే అందరికీ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు తక్షణమే హాస్టళ్లను ఖాళీ చేసి స్వగ్రామాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. యూనివర్సిటీ పరిధిలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య, మెయిన్టెనెన్స్ పనులు కొనసాగుతున్నందున హాస్టళ్ల మూసివేతనకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. హాస్టళ్ల పున: ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
Next Story