BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు గడువు తేదీ పెంపు

by Disha Web Desk 19 |
BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు గడువు తేదీ పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28వ తేదీ వరకు అప్లికేషన్ గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 21వ తేదీనే గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ దరఖాస్తు గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్-1 పోస్టులకు ఏపీపీఎస్సీ డిసెంబర్ 8వ తేదీన నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 1 నుండి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 21తో గడువు ముగియగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు తేదీని మరో వారం పొడగించింది. ఇక, మార్చి 17వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Next Story

Most Viewed