Ap Assembly Sessions: అసెంబ్లీలో ప్రారంభమైన గవర్నర్ నజీర్ ప్రసంగం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-07-22 14:55:28  IST  )

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి....

Ap Assembly Sessions: అసెంబ్లీలో ప్రారంభమైన గవర్నర్ నజీర్ ప్రసంగం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ప్రస్తుతం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ సభ్యులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన సభ్యులు సైతం హాజరయ్యారు. నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. జాతీయ గీతం ఆలాపన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.

Read More..

Ap News: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

Next Story