తిరుపతి వాసులకు గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనం టోకెన్లు రేపే జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-08 17:10:55  IST  )

తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

తిరుపతి వాసులకు  గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనం టోకెన్లు రేపే జారీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11న తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ మేరకు ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4నే శ్రీవారి దర్శనానికి అనుమతించాల్సి ఉండగా.. ఆ రోజు రథ సప్తమి వేడుకలు జరిగాయి. దీంతో తిరుపతి వాసులకు ఈ నెల 11(రెండో మంగళవారం)న శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా టోకెన్లను ఆదివారం పంపిణీ చేయనున్నారు.

Next Story