- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ పాలిసెట్-2023 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణితో కలిసి శనివారం ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో 86.35శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 88.90శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.74శాతం ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి.
ఈ ఏడాది మే 10న పాలిసెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. పాలిసెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.