ఏపీ తీవ్ర అభ్యంతరం.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది...

ఏపీ తీవ్ర అభ్యంతరం.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో ఈ రోజు కృష్ణా ట్రైబ్యునల్‌(Krishna Tribunal)లో ఏపీ ప్రభుత్వం(Ap Govt) వాదనలు వినిపించింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) మధ్య నీటి పంపిణీకి ట్రైబ్యునల్ ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ వాదనలు వినిపించింది. జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. బచావత్ ట్రైబ్యునల్ నుంచి ఇప్పటి వరకూ పరిణామాలను ప్రభుత్వం వివరించింది. దీంతో తదుపరి విచారణను నవంబర్ 25, 26, 27 తేదీలకు వాయిదా వేసింది.

Next Story