Precision strikes: మా విద్యార్థులను క్షేమంగా తీసుకురండి.. రెసిడెంట్ ​కమిషనర్​కు ఏపీ ఎంపీ లేఖ

by Thanuru Gopichand |

పాకిస్తాన్ కవ్వింపు చర్యల దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.

Precision strikes: మా విద్యార్థులను క్షేమంగా తీసుకురండి.. రెసిడెంట్ ​కమిషనర్​కు ఏపీ ఎంపీ లేఖ
X

దిశ డైనమిక్ బ్యూరో : పాకిస్తాన్ కవ్వింపు చర్యల దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఢిల్లీలో రెసిడెంట్ కమీషనర్ గా ఉన్న లవ్ అగర్వాల్ కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లేఖ రాశారు. జమ్మూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులని క్షేమంగా తీసుకురావాలని, కేంద్ర అధికారులతో సమన్వయం చేయమని ఈ లేఖలో అభ్యర్థించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, విద్యార్థులకు పూర్తి సహాయ సహకార అందించి వారిని క్షేమంగా తీసుకువస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు.

Next Story