APకి కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో బకాయిలు క్లియర్

by Disha Web Desk 16 |
APకి కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో బకాయిలు క్లియర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జీఎస్టీ బకాయిలను జాప్యం చేస్తున్నారని, త్వరగా బకాయిలు విడుదల చేయాలని ఎంపీ బాలశౌరి లోక్‌సభలో కోరారు. ఏపీకి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎంపీ బాలశౌరి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏపీకి రూ.689కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని..ఆ సొమ్మును పరిహార నిధి నుండి త్వరలోనే క్లియర్ చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని బ్యాక్ టూ బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేసామని ప్రకటించారు.


Next Story

Most Viewed