AP Govt: మరో నాలుగు కార్పోరేషన్లకు డైరెక్టర్లు.. ప్రకటించిన కూటమి ప్రభుత్వం

by Ramesh Goud |

ఇటీవలే ఆరు కార్పోరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కూటమి ప్రభుత్వం మరో నాలుగు కార్పోరేషన్లకు(Four Corporations) కూడా డైరెక్టర్లను(Directors) ప్రకటించింది.

AP Govt: మరో నాలుగు కార్పోరేషన్లకు డైరెక్టర్లు.. ప్రకటించిన కూటమి ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే ఆరు కార్పోరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కూటమి ప్రభుత్వం మరో నాలుగు కార్పోరేషన్లకు(Four Corporations) కూడా డైరెక్టర్లను(Directors) ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ల పేర్లతో కూడిన లిస్ట్ ను విడుదల చేసింది. ఇందులో ర‌జ‌క‌(Rajaka), కొప్పుల వెల‌మ‌(Koppula Velama), గ‌వ‌ర‌(Gavara), నాయీ బ్రాహ్మ‌ణ(Nayi Brahmin) కార్పొరేషన్ల‌ు ఉన్నాయి. వీటిలో ఒక్కో కార్పొరేష‌న్‌కు 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్ట‌ర్ల నియామించింది. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడిన నేతలకు అవకాశం లభించింది. వీరిలో టీడీపీ నాయకురాలు సువ్వారి అనురాధ(TDP leader Suvvari Anuradha), బీజేపీ నేత కూసుమంచి సుబ్బారావు(BJP leader Kusumanchi Subbarao) సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇక ప్ర‌తి కార్పొరేష‌న్‌లో జ‌న‌సేన(Janasena) నుంచి ఇద్ద‌రు, బీజేపీ(BJP) నుంచి ఒక‌రికి అవ‌కాశం వరించింది. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం నిన్న ఆరు కార్పోరేషన్లకు 90 మంది డైరెక్టర్లను నియమించిన విషయం తెలిసిందే.

Next Story