కేంద్ర పథకాలకు గుర్తింపు కల్పించడంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం : కేంద్ర మంత్రి భారతి పవార్‌ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
కేంద్ర పథకాలకు గుర్తింపు కల్పించడంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం : కేంద్ర మంత్రి భారతి పవార్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుతవ్వ పథకాలకు గుర్తింపు కల్పించడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య ్ధోరణి ప్రదర్శిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పర్యటనలో భాగంగా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించగా.. బోర్డుల్లో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం కన్పించడం లేదన్నారు. ప్రధాని మోదీ ఫొటోలు కూడా కనిపించకుండా మాయం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల మంజూరును నిలిపేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఆంధ్రలో మొత్తం 26 జిల్లాల్లో 125 వాహనాలతో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత ఉన్న వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు.


Next Story

Most Viewed