AP News : బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) శుభవార్త తెలిపింది.

AP News : బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) శుభవార్త తెలిపింది. సంక్రాంతి సెలవుల(Sankranthi Holiday)ను మరో రోజు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15వ తేదీన కనుమ పండగ రోజును పురస్కరించుకొని బ్యాంక్ ఉద్యోగులకు ప్రభుత్వం సాధారణ సెలవు మంజూరు చేసింది. బ్యాంక్స్ యూనియన్ కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా సంక్రాంతి పండగ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం రెండు రోజులు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఉద్యోగుల ప్రత్యేక వినతులు దృష్టిలో పెట్టుకొని మరో రోజు సెలవు పొడగించింది.

Next Story